పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు ధరల పెరుగుదలపై సిపిఎం ఆధ్వర్యంలో లింగలగణపురం మండల కేంద్రములో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు తూటి దేవదానం గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడం లేదని విమర్శించారు. ప్రజలపై ధరల భారాన్ని మోపి కార్పొరేట్.శక్తులకు దోచిపెడుతుందని తీవ్రంగా మండిపడ్డారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే అనుకూల విధానాలు చేపట్టాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని విద్య వైద్య సౌకర్యాలను ప్రజలకు ఉచితంగా అందించాలన్నారు. ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కొడ్లను రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులనుపర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు గోసంగి. శంకరయ్య మబ్బు. ఉపలయ్య మబ్బు. వెంకటేష్ రాపోలు. సమ్మయ్య కడారి.శ్రీను నల్ల. కుమార్ గుగిల్ల. సుధాకర్ కోపుల్ల. ఉప్పలయ్య పాలమకుల. రవి కరుకోపుల. యక్కన్న లగాల.రమేష్ నిల.రమేష్ గోసంగి.సందీప్ పాల్గొన్నారు.
Read More :
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments