OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ తిరుపతి పర్యటన



అమరావతి 

జనసేన అధినేత పవన్‌ కల్యా ణ్‌ సోమవారం ఉదయం తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నేత కొట్టే సాయి పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. సాయిపై దాడి చేసిన సీఐ అంజు యాదవ్‌పై చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తారు.

జనసేనలోకి ఆమంచి సోదరుడు

ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు(స్వాములు) జనసేనలో చేరారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. రాజ్యాధికారం ఎవరి సొత్తూ కాదని, దాన్ని జన్మహక్కులా భావించి, నియంత పాలన చేస్తానంటే కుదరదని అన్నారు. వైసీపీ దాష్టీకాలపై తెగించి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ పోరాటంలో ఎవరిపై దెబ్బపడినా తనపై దెబ్బ పడినట్లే భావిస్తానన్నారు. ఆమంచి స్వాములు లాంటి నాయకుల బలమే జనసేనకు కావాలన్నారు. స్వాములు జనసేనలో చేరడం వల్ల ప్రకాశం జిల్లాలోనే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా పార్టీకి బలం చేకూరిందన్నారు...

Read More:

పట్టు రైతుల సమ స్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం 

BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.

  రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి


Post a Comment

0 Comments