జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు... అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో (1) కొడిమి,( 2) ఆలమూరు, (3) ఉప్పరపల్లి మరియు (4) చిన్మయి నగర్ జగనన్న కాలనీల సందర్శన.

1) "కొడిమి" దగ్గర ఉన్న జగనన్న కాలనీ దుస్థితి.
అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజలకు 7000 గృహాలను " కొడిమి గ్రామం" దగ్గర 120 ఎకరాల స్థల సేకరణ చేసి, ఎకరాకు 28 లక్షల రూపాయల చొప్పున వైసిపి పార్టీ నాయకులకు మాత్రమే డబ్బులు చెల్లించి మిగతా వారికి నేటి వరకు డబ్బులు చెల్లించలేదు. ఈ కాలనీ నందు నేటి వరకు ఒక గృహం నిర్మాణం కూడా జరగని దౌర్భాగ్య దుస్థితి.
2) "ఆలమూరు" దగ్గర జగనన్న కాలనీ దుస్థితి.
"ఆలమూరు గ్రామం" దగ్గర జగనన్న కాలనీలో 5315 గృహాలలో .... అనంతపురం నియోజకవర్గంకు చెందిన కొంతమందికి గృహాలు కేటాయించినారు. ఈ కాలనీ నందు నేటి వరకు కనీసం 100 గృహాలు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయలేదు.
3) "ఉప్పరపల్లి" దగ్గర జగనన్న కాలనీ దుస్థితి.
ఇతర నియోజకవర్గాలతో పాటు అనంతపురం నియోజకవర్గం ప్రజలకు "ఉప్పరపల్లి "దగ్గర అనంతపురం చెరువుకు ఆనుకొని గృహాలను కేటాయించారు. ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 డబ్బులు చాలక కొంతమంది లబ్ధిదారులు లక్షల రూపాయలు అప్పులు తీసుకొని ఇల్లు నిర్మించుకుంటున్నారు... కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
4) "పరసన్నాయిపల్లి" దగ్గర టీడ్కో ఇల్ల దుస్థితి.
అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజలకు "చిన్మయ నగర్ దగ్గర " టిడ్కో ఇళ్లకు లబ్ధిదారుల చేత డబ్బులు వసూలు చేసి.. నేటి వరకు ఒక గృహాన్ని కూడా లబ్ధిదారులకు అంద చేయలేదు.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 30 లక్షలు ఇస్తాం? కాలనీలు కాదు? ఊర్లునిర్మిస్తున్నామని? ప్రజలకు మాయ మాటలు చెబుతూ, గొప్పలు చెప్పుకుంటూ కాలం వెలబుచ్చుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పై కాలనీల నందు కనీసం ఒక్క గృహాన్ని కూడా లబ్ధిదారులకి పూర్తిచేసి లబ్ధిదారులకు అందించలేదు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రజల సంపదని రాబందుల్లా దోచుకుంటున్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు జగనన్న కాలనీలు కాదు? జగనన్న ఊర్లు అంటరి? కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా గృహ నిర్మాణానికి డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించకపోగా నేటి వరకు గృహాలను లబ్ధిదారులకు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారో? తక్షణమే రాష్ట్ర ప్రజలకు వివరణ తెలియచేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, దేవరాయల విజయ్, భవాని నగర్ సాయి కిరణ్, కుంటిమద్ది గుజ్జల దుర్గాప్రసాద్, ప్రవీణ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More :
G20 Summit: జీ20 కోసం భారత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?
AP లో భారీగా బదిలీలు ఏపీ లో 35 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీలు
0 Comments