బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన 'చంద్రయాన్-3 (Chandrayaan-3)' వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన అయిదో కక్ష్య పెంపు (Orbit Raising Manoeuvre)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం విజయవంతంగా నిర్వహించింది.
బెంగళూరులోని 'ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC)' నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీంతో చంద్రయాన్ ఇప్పుడు 127609 కి.మీ x 236 కి.మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.
ఇదిలా ఉండగా.. భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య. దీని తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ విన్యాసాన్ని (TransLunar Injection) ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటివరకు దశలవారీగా అయిదుసార్లు పెంచి.. చంద్రయాన్-3ని జాబిల్లికి చేరువచేస్తున్నారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది..
ఆగస్టు 1న మహారాష్ట్రలో సీఎం కెసిఆర్ పర్యటన 7/30/23 12:46 PM
పీఎస్ఎల్వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్
అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జగనన్న కాలనీల సందర్శన.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు
నేడే ఢిల్లీ బిల్లు, ప్రతిపక్షాలు "సై"- సీఎం జగన్ పైనే బీజేపీ ఆశలు..!!
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయడం పట్ల హర్షం
0 Comments