OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ఒక్క హైదరాబాద్ నుండే తెలంగాణకు 50 శాతం ఇన్‌కమ్ మంత్రి కేటీఆర్

 

Telangana's 50 percent income minister is KTR from Hyderabad alone



హైదరాబాద్ :
పట్టణాల కోసం నిబద్దతతో పనిచేశాం కాబట్టే కేంద్రం కూడా గుర్తిచాల్సిన పరిస్థితి కల్పించామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌లో బుధవారం ఆయన రాష్ట్ర పురపాలక శాఖ 9 ఏళ్ల నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందువల్లే అనేక అవార్డుల, ప్రశంసలను ప్రత్యర్ధి అయిన కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్ పెడుతూ ప్రజలకు భద్రత కల్పించేందుకు స్కై వేలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు తాము రక్షణ శాఖ భూములను అడిగిన కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సుమారు 45 నుంచి 50 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ప్రజారవాణాను మెరుగుపర్చడం, మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ర్టిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమత్తు కార్యక్రమాల వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పాతబస్తీ మెట్రో రైల్ కోసం కేంద్రాన్ని నిధులను అడిగామని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

ఐదుగురు కేంద్ర మంత్రులు మారినా నగరంలో ప్రజారవాణాకు రక్షణ భూములు అడిగితే ఒకటిన్నర ఎకరం కూడా ఇవ్వలేదని విమర్శించారు. మెట్రో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్‌లను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. కంటోన్మేంట్ పైన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అయినప్పటికీ మేము జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నామన్నారు. 111 జీవో రద్దు కోసం అన్ని పార్టీలు హమీలు ఇచ్చాం. మేము చేప్పినట్టే జీవోను రద్దు చేశామని స్పష్టం చేశారు....

Read More:



 లోకేశ్‌ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్

 గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి

 పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం 

  BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.

  రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి


Post a Comment

0 Comments