సూర్యాపేట నియోజకవర్గం
ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.... పేదల సొంత ఇంటి కళను సాకారం చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామానికి చెందిన దుండిగల రాములు గారి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి గారు ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ..
డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments