గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కలెక్టరేట్ ముందు ధర్నా
వినూత్న నిరసన వంటావార్పు
తక్షణమే వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
జనగామ : గ్రామపచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్( సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించి వంటా వార్పుతో కలెక్టరేట్ ముందు సహపంక్తి భోజనాలు చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఆరు నెలలుగా వేతనాలు లేకుండా పస్తులతో పనిచేస్తున్న పరిస్థితి దాపురించిందని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెకు దిగుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడంతో కామారెడ్డి జిల్లాలో గ్రామపంచాయతీ సిబ్బంది కొంగరి బాబు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడంటే గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు మా పంచాయతీ సిబ్బంది ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు మరణించి కొంగరి బాబు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామపంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు ఉద్యోగ భద్రత పర్మినెంట్ తదితర డిమాండ్ల సాధన కోసం గ్రామపంచాయతీ సిబ్బంది సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తిని వెంకన్న నారోజు రామచంద్రం సిఐటియు జిల్లా కోశాధికారి సుంచు విజయేందర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు మల్లాచారి ,బసవ రామచంద్రు రామ్ నారాయణ గుర్రం లాజర్ బోస్ రాజు తిప్పారపు యాకూబ్ జగన్ కుంభం రాజు బాలనర్సయ్య, సత్యనారాయణ రమేష్ వెంకట్ రెడ్డి ఐలయ్య వెంకటరమణ శ్యామ్ గంగరబోయిన మల్లేష్ రాజ్ సుదర్శన్ వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్ర పూజలు: ఇద్దరి అరెస్ట్
వరంగల్ : మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏం. ఏ బారి, సెంట్రల్ జోన్ డీ సి పి గారు ఈ మేరకు వివరాలు తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంబించి, ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు. *టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఏం. జితేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ , ఏ సి పి గారి ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు మరియు వైద్యశాఖ సిబ్బంది తో ఫారహీన ఆసుపత్రి పై ఈ రోజు 13.03.2023 ఉదయం దాడులు చేసి, ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్రపూజలు చేసి చేతబడి చేసినవారికి తగ్గిస్తామని , సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) అదుపులోకి తీసుకొని విచారించారు.
పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు :
వీరు ఎక్కవగా పౌర్ణమి, అమావాస్య లలో క్షుద్రపూజాలు చేసి, తన దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క రోగాలను నయం చేసే నెపం తో క్షుద్రపూజాలు చేసి, వారిని నమ్మించి అదిక మొత్తం లో డబ్బులు వసూలు చేశారు. సయ్యద్ ఖాదిర్ అహ్మెద్ గతంలో కరీంనగర్ లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకొని , తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టేవాడు. ఈ అనుబావం తో అతను హనమకొండ లోని నయీంనగర్ లోని కె యు సి క్రాస్ రోడ్డు వద్ద గత 35 సం.. ల నుండి తన స్వంత భవనం లో ఫారహీన క్లినిక్ పేరిట నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతి మరియు ల్యాబూ పత్రాలు లేకుండా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని తన వద్దకు వచ్చిన రోగులకు వారి పై గిట్టని వారు చేతబడులు చేశారని, దయ్యం పట్టినధి అని, నర దృష్టి ఉంది అని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతనాలు కలుగడం లేదని , ఉద్యోగాలు రావడం లేదని , కుటుంబ తగాదాలు పరిష్కారం కోసం వారికి లేని పోనీ భయలును కలిగించి క్షుద్రపూజాలు చేసి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. కొంతమంది దీర్గ కాలం గాట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దోచుకోవడం చేస్తున్నాడు. కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటానికి వారికి ఆలోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తరువాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు వలనే చేయడం వల్లనే తగ్గినధి అని నమ్మిస్తున్నారు. ఇతను హన్మకొండ లోనే కాకుండా హైదరాబాద్ లో మరియు కొంత మంది రోగుల స్థితి ని బట్టి వారి యొక్క స్వస్థలకి వెళ్ళి క్షుద్రపూజాలు నిర్వహిష్టడు. ఇతనికి ఇట్టి క్షుద్రపూజాలు కు సహాయకులు గా ఉన్న సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46) తండ్రి పేరు నూర్ నివాసం ఉప్పల్, హైదరాబాద్ అదుపులోకి తీసుకొనినది. ఇట్టి క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా మరియు అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ వారు పరారీలో ఉన్నారు. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం 5-11-509, నియర్ కె యు సి, నయీంనగర్. పై గతం లో గుప్తా నిదుల తవ్వకం పై ములుగు ఘనపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్. నెంబర్ 30/2017 U/s 447,427,420 r/w 34 IPC , 20 ITTA Ac t. ]
వీరి వద్ద నుంచి పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు.
అరెస్ట్ అయిన వారు : 02
1. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ తండ్రి పేరు ఖరిముళ్ల ఖాద్రి, 53 సం.. లు, ముస్లిం, ఫేక్ డాక్టర్ నివాసం
5-11-509, నియర్ కె యు సి,
2. సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) నివాసం హబ్సిగూడ హైదరాబాద్
పరారీ లో ఉన్నవారు : 03
1.యాకూబ్ బాబా మరియు అతని 2.భార్య సమరీన్, 3.ఏం. డీ ఇమ్రాన్
స్వాదిన పరుచుకున్న వస్తువులు:
1. ఆలోపతి మందులు
2. క్షుద్రపూజ సామగ్రి-2.
3. ల్యాబ్ టెస్ట్ సామగ్రి.
4. చరవాణి-01
5. తవేర వాహనం. 01
6. పేషెంట్ రిజిస్టర్ : 01 మరియు కరపత్రం
7. నగదు: 3,00,000/-
వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావ్, ఎస్సై లు నిస్సార్ పాషా, లవన్ కుమార్, ఏ ఏ వో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలతా మరియు కానిస్టేబుల్ బిక్షపతి, రాజేష్, రాజు, శ్రీనివాస్, శ్రావణ కుమార్, నాగరాజు, నవీన్ లను ఆబినందిచారు
0 Comments